Friday, April 27, 2012

సంగీతం


సంగీతం



భారతీయ సంగీతానికి మూలం సామవేదం. సంగీతంలో కర్ణాటక, హిందుస్తానీ, వాగ్గేయకారుల  భక్తీ గీతాలు, జానపద గీతాలు, బుర్రకధలు మొదలయినవి ఉన్నాయి. అనాదిగా ప్రజలు  పాడుకొనే జానపద సంగీతం నుంచి పుట్టి,”సంస్కృతీకరించబడి” ప్రస్తుతపు రూపాన్ని... సంతరించుకున్న మన శాస్త్రీయ సంగీతం ఈనాటి “ప్రజల” సంగీతమైన సినీగీతాలనూ,  “లలిత” సంగీతాన్ని విశేషంగా ప్రభావితం చేసింది. మారుమూల పల్లెల్లో సినిమా
“షోకులు” సోకనివారు మాత్రం ఇంకా తమ జానపద సంగీతం పాడుకుంటూనే ఉన్నారు. గద్దర్  వంటి గాయకులు ఆ బాణీలను అనుసరించి తమ భావాలను అతి సమర్ధవంతంగా ప్రకటించడం  చూస్తూనే ఉన్నాం.
 
సంగీతం రాళ్లనయినా కరిగిస్తుంది. అమృతవర్షిణి, మేఘరంజని రాగాలు వర్షాన్ని కూడా  కురిపిస్తాయి. దీపక రాగం మంటలను పుట్టిస్తుంది. రాగాలతో 'రాగ రాగిణి విద్య'  ద్వారా రోగాలని కూడా తగ్గించచ్చు అని, శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి  నిరూపించారు. మన శరీరంలోని 72 ,000 నాడులు ఒక క్రమంలో స్పందిస్తాయట, ఆ
స్పందనలోని తేడాలే, రోగాలకి మూలమని, రాగాలతో ఆ స్పందనను తిరిగి  పునర్నిర్మించడమే, తన చికిత్స అని, వారు చెబుతారు. సింధుభైరవి రాగం పాపాలని,  బాధలని తొలగిస్తుంది. భూపాల, మలయ మారుత రాగాలు, ఉదయ రాగాలు. చక్రవాక, భైరవి  రాగాలు విషాద రాగాలు. త్యాగరాజ స్వామి 'శ్రీ రామ పాదమా' అనే కృతిని
ఆలపించినప్పుడు, చచ్చినా మనిషి తిరిగి బ్రతకడమే కాక, శ్రీ రామ సాక్షాత్కారం  కూడా లభించిందట. సంగీతానికి అంత మనవాతేట శక్తి ఉంది. మరిన్ని రాగాల విశిష్టతలు  చదవడానికి కింది లింక్ ను ఉపయోగించండి.
http://www.sikhiwiki.org/index.php/రాగా

సంగీత సాహిత్యాలు ఒకదానికి ఒకటి ఊతమిస్తాయి.సాహిత్యం ఒక భావాన్ని ఒలికిస్తే,  సంగీతం ఆ భావనకు ప్రాణం పోసి, పలికించి, మనసుని మరిపిస్తుంది.ఒక్కొక్క  వాయిద్యంలో ఒక్కొక్క రకమయిన లాలిత్యం ఉంటుంది. ప్రేమ గీతం, వినే వాళ్ళను ఆ  భావనలో నిమగ్నమయ్యేలా చేస్తే, భక్తీ గీతం భగవంతుడి రూపాన్ని కళ్ళ ముందు
సాక్షాత్కరింప చేస్తుంది.  విషాద గీతాలు ఆ సందర్భంలో వ్యక్తి అంతర్మధనాన్ని  పలికిస్తే ,ప్రకృతి ఆరాధనా గీతాలు కళ్ళముందు సెలయేళ్ళను, నెలవంకలను,  హరివిల్లును సృష్టిస్తాయి. ఇదే సంగీతం లోని మహత్తు. మిత్రులారా, సిని  గీతాలయినా, లలితా గీతాలయినా, కీర్తనలయినా, జానపద గీతాలయినా, భావ  ప్రధానమయిన మంచి సంగీతాన్ని వినండి. మీ రోజువారి అలసటల నుండి విశ్రాంతి  పొందండి

No comments:

Post a Comment