Saturday, February 2, 2013

మనవి



మనవి 


ఉత్తుత్తి గురుదేవులు జఫ్ఫానంద స్వామి వారికి,
స్వామీ, ఇవాళ ఆదివారం, కొందరు ఈగ కోసం వెళిపోయారు, కొందరు మాల్ల్స్ కి, కొందరు
బయటికి. అంతా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ. ఇక ఖాళీ గా ఉన్నది ఈ పోస్ట్
రాస్తున్నా నేను, ఇంక చదివే మీరు. మన కోసం, కొత్త ప్రతిజ్ఞ రాసాను. ఇది ప్రతి
పాటశాల లో, పిల్లలంతా కంటస్తం పట్టి అప్పగించాలి అంటే, మీ దీవెనలు కావాలి.
మీరు ఒక్క సారి చదివి మీ ఆశీస్సులు అందించండి.



'ఓ భగవంతుడా, ప్రతి వీధిలో ఒక నిత్య MLA లేక MP లేక ఒక VIP ఉండేలా దీవించు.
అప్పుడు ఆ వీధిలో దీపాలు, నీళ్ళు పారిశుధ్యం, కరెంట్ కోత లాంటి సమస్యలు ఉండవు.
ఎన్నికలు ఐదేళ్లకు ఒక సారి కాకుండా, ఆరు నెలలకు ఒక సారి వచ్చేలా దీవించు.
అప్పుడు రాజకీయ నాయకులు ఐదేళ్ళు ఆవులిస్తూ కూర్చోకుండా పనిచేస్తారు. అప్పనంగా,
లంచాలు తినే వాళ్ళ ముక్కు మూరెడు సాగేలా దీవించు. అందరూ, అసహ్యించుకుంటే,
అప్పుడయినా మారతారు. పబ్లిసిటీ కోసం ఎంతకయినా తెగించే మీడియా వాళ్ళ నెత్తిన
బొప్పి కట్టేలా, దీవించు. బొప్పి చూసి, తప్పు కనిపెట్టేస్తారు. రూపాయి విలువ
డాలర్ కి, డాలర్ విలువ రూపాయికి వచ్చేలా చూడు. అప్పుడు వాళ్ళంతా, మన దేశానికి
ఉద్యోగాలకి వస్తారు. అప్పుడు ప్రవాసీయులను ఎలా గౌరవించాలో, మన సంస్కృతి ఏమిటో
వాళ్లకు చెప్దాం. మన కట్టు-బొట్టు నేర్పించేద్దాం. ఆత్మలు భారతావనిలో, మనుషులు
విదేశాల్లో ఉన్న ప్రవాసీయులంతా తిరిగి వచ్చేలా చూడు. 'రైన్ రైన్ గో అవే' లాంటి
విదేశి పద్యాలు పాడే టప్పుడు, 'బాల వాక్కు బ్రహ్మ వాక్కు ' కనుక , వచ్చే
వానలు నిలచిపోతున్నాయి. దిగుమతి పద్యాలు బహిష్కరించి, 'చిట్టి చిలకమ్మా...'
అని చిన్నారులు పాడుకునే అదృష్టాన్ని, మళ్లీ ప్రసాదించు.ఈ దేశంలో మరి కొందరు
కర్మ యోగులు, సద్గురువులు జన్మించేలా దీవించు, వారి నిష్కల్మష ప్రార్ధనలు లోక
కల్యాణం కలిగిస్తాయి. నా దేశంలో ఒక్క పేద వాడు కూడా, ఆకలితో చావకుండా దీవించు.
ప్రతి వారికి కనీస అవసరాలయిన తిండి- బట్ట - నీడ ఉండేలా దీవించు. అక్రమంగా
దొరికిన సొమ్మంతా, అమర సైనికులకి, పోలీసు కుటుంబాలకి ఇచ్చేలా దీవించు.
ఉన్నన్నాళ్ళు, మనుషులకి మాయా రోగాలు వచ్చి, హాస్పిటళ్ళ పాలు అవ్వకుండా
దీవించు. బాధ, దుఃఖం, , స్వార్ధం, మోసం లేని ప్రశాంత భారతావనిని మాకు అందించు.'

ఏంటి తల్లి, నువ్వు రాసినంత మాత్రాన, జరిగిపోతాయా? అంటారా. సంకల్ప బలం ఉంటే,
జరగని కార్యం లేదు స్వామి. ప్రకృతి, దైవం కూడా మనకు తోడుగా తల వంచుతాయి.ప్రతి
భారతీయుడు, నిద్ర లేవగానే, 'నా దేశం గొప్పది. నా దేశం సుభిక్షంగా ఉండాలి. నా
దేశ ప్రజలంతా ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండాలి. నా దేశం అన్ని దేశాల కంటే ఉన్నత
స్థానంలో ఉండాలి...' అని కోరుకుంటే, ఇది తప్పక జరుగుతుంది. మరి మీ ఉత్తుత్తి
ఆశీస్సులు అందినట్టేగా స్వామి. నాకు తెలుసు, మన గురు- శిష్యురాళ్ళ మధ్య ఉన్న
అవగాహన అలాంటిది.జై భారత్.

1 comment: