Tuesday, December 17, 2013

ఫేస్బుక్ ధీరులు

హరికధా పితామహులు ఆదిభట్ల నారాయణ దాసు గారు త్రాగుబోతులను వర్ణిస్తూ ఒక పద్యం చెప్పారు. అందులో, డోసు డోసుకు త్రాగుబోతులు ఎలా మారిపోతారో హాస్యాస్పదంగా వివరించారు. అదే పద్యం ముఖపుస్తక బాదితులకీ వర్తిస్తుందని నాకు అనిపించింది. ఆ పద్యానికి నేను వ్రాసిన పారడీ పద్యాన్ని చదవండి.

శుకః పికో కాకశ్చైవ ,మర్కట వాచాలశ్చతు !
జాడ్యంచ వైరాగ్యంచ ,సప్తైంతే ముఖపుస్తక లక్షణా !

మొదట అంతా చిలకల్లా పలుకుతారు. తరువాత కోకిలలా కూస్తారు. తర్వాత కాకిలా అరుస్తారు. తర్వాత కోతిలా గోడ మీద నుంచీ గోడమీదికి, వేర్వేరు గ్రౌపులలోకి చంచలంగా దూకుతారు. తర్వాత వాదోపవాదాలలో తమ వాచాలత చాటుతారు . నెమ్మదిగా వారికి ముఖపుస్తక జాడ్యం పట్టుకుంటుంది. ఎన్నాళ్ళు వాదిస్తారు... ఓపిక చచ్చి వైరాగ్యం పొందుతారు. అటువంటి వారిలో కొందరు ఖాతాలు ఎత్తేసి, వానప్రస్థం స్వీకరిస్తారు. ఇవండీ ముఖపుస్తక లక్షణాలు. ఈ రోట్లో తల పెట్టి, రోకటిపోటుకు తట్టుకుని, పై అవతారాలు ఎత్తి , నిలబడ్డవారే ధీరులు!


                              Photo: హరికధా పితామహులు ఆదిభట్ల నారాయణ దాసు గారు త్రాగుబోతులను వర్ణిస్తూ ఒక పద్యం చెప్పారు. అందులో, డోసు డోసుకు త్రాగుబోతులు ఎలా మారిపోతారో హాస్యాస్పదంగా వివరించారు. అదే పద్యం ముఖపుస్తక బాదితులకీ వర్తిస్తుందని నాకు అనిపించింది. ఆ పద్యానికి నేను వ్రాసిన పారడీ పద్యాన్ని చదవండి.

శుకః పికో కాకశ్చైవ ,మర్కట వాచాలశ్చతు !
జాడ్యంచ వైరాగ్యంచ ,సప్తైంతే ముఖపుస్తక లక్షణా !

మొదట అంతా చిలకల్లా పలుకుతారు. తరువాత కోకిలలా కూస్తారు. తర్వాత కాకిలా అరుస్తారు. తర్వాత కోతిలా గోడ మీద నుంచీ గోడమీదికి, వేర్వేరు గ్రౌపులలోకి చంచలంగా దూకుతారు. తర్వాత వాదోపవాదాలలో తమ వాచాలత చాటుతారు . నెమ్మదిగా వారికి ముఖపుస్తక జాడ్యం పట్టుకుంటుంది. ఎన్నాళ్ళు వాదిస్తారు... ఓపిక చచ్చి వైరాగ్యం పొందుతారు. అటువంటి వారిలో కొందరు ఖాతాలు ఎత్తేసి, వానప్రస్థం స్వీకరిస్తారు. ఇవండీ ముఖపుస్తక లక్షణాలు. ఈ రోట్లో తల పెట్టి, రోకటిపోటుకు తట్టుకుని, పై అవతారాలు ఎత్తి , నిలబడ్డవారే ధీరులు!

1 comment: