Saturday, August 25, 2012

వ్యాపారం

 వ్యాపారం అన్న మాట వినగానే నాకు నా మరాఠీ స్నేహితురాలు,యుగంధర అన్న మాటలే గుర్తుకొస్తాయి. ' కొండ ఎక్కాలనుకో, తిన్నగా 

ఎక్కలేము కదా పద్మిని, పక్కదారో, డొంక దారో, రాళ్ల మీదో అడుగులేసి, అడ్డదిడ్డంగా పోవాలి. అప్పుడే కొండ

శిఖరాన్ని చేరుకోగలం. వ్యాపారము అంతే, కొంత మోసం తప్పదు.'


వస్తువులు తయారుచెయ్యడం ఒక ఎత్తయితే, వాటిల్ని ప్రచారం చేసి అమ్మడం ఇంకో 
ఎత్తు.మార్కెటింగ్ లేక ప్రచారం. ఈ మాట వినగానే, 

చిన్నప్పుడు వీధుల్లో రిక్షా ల మీద సినిమా ప్రచారం గుర్తుకొస్తుంది. "రండి బాబు రండి, మీ అభిమాన సినిమా హాల్ రంభలో, కత్తి.. కత్తి...కత్తి

కాంతారావు,రాజశ్రీ నటించిన అగ్గి దొర, రోజుకు నాలుగు ఆటలు, నేడే చూడండి. జానపద బ్రహ్మ విటలాచార్య తీసిన, అగ్గి ..అగ్గి... అగ్గి దొర 

బాబు, ఆడ వేషాలు వేసిన మగ దయ్యాలు మీ కోసం ఎదురు చూస్తున్నాయి, ఆలసించిన ఆశాభంగం, నేడే చూడండి...'






అంటూ బోలెడంత సందడి చేస్తుంటే, వంటింట్లో ఆడవాళ్ళతో సహా, అంతా వీధుల్లోకి వొచ్చి మరీ చూసేవాళ్ళు. ఎప్పుడయినా రైతు బజార్ 

వెళ్ళరా? అప్పటిదాకా మామూలుగానే ఉన్న టొమాటోలు హటాత్తుగా ఎర్రటి పిల్ల రాగానే, 'ఎర్ర, ఏర్ర్ర్రర్ర్ర్ర, ఏర్ర్ర్రర్ర్ర్ర, ...టొమాటోలు ఎక్కువ ఎక్కువ 

ఇక్కడ, రండమ్మా...' అంటూ అంత ఎరుపు ఎందుకు అయిపొతాయో నాకు తెలియదు. మరొకరు, 'ఆ ..రండి సర్, నెంబర్ 1 సరుకిక్కడ, 

కొనాల..తినాల... ' అంటుంటే..ఎదురుగుండా ఉన్న మరొకరు, ' ఆ రండి బాబు చెత్త సరుకు ఇక్కడ...ఎంత తాజాగా ఉన్నాయో చూడండి..' 

అంటాడు. జనాల దృష్టి చెత్త సరుకన్న వాడి కూరల మీద తప్పకుండా పడుతుంది. ఇంకో ఆమె..' రా బిడ్డ, రా, ఆక్కూరలు వేసుకుందువు, 

రా బిడ్డ ..' అంటూ పిలుస్తుంటే, ఆ గొంతులోని మార్ధవానికి, అక్కడికే వెళ్లి కొనాలని అనిపిస్తుంది. ఇవండీ వారి ప్రచార పద్ధతులు. డబ్బు 

విపరీతంగా ఉండి, జబ్బు చేసి, ఏమి చేసుకోవాలో తెలియని వారు, ఎక్కడో, అడవుల్లో, నిర్మానుష్య ప్రాంతాల్లో, రిసార్ట్స్ కడతారు. మరి 

అందులో ఉండడానికి గొర్రెలు కావాలి కదా, ఎవరో కాదండి, మనమే. ఏదో ప్రశాంతంగా సూపర్ మార్కెట్కో, ఎక్ష్హిబిషన్కో, షాపింగ్ మాల్కో, లేక 

పార్క్ కో వెళ్ళారనుకోండి, చప్పున తగులుకుంటారు. 'మేడం, లక్కీ డ్రా కూపోన్ మేడం, పేరు, ఫోన్ నెంబర్ రాసివ్వండి,' అంటూ. ఒక వేళ 

మీరు రాసి ఇచ్చారో, దొరికిపోయారన్నమాటే. మర్నాడే ఫోన్,' మీరు చాలా అదృష్టవంతులండి, మా క్లబ్ మెంబెర్షిప్ ఇస్తాము, ఇదు తారల 

హోటల్ లో స్టే, 2 పగళ్ళు, మూడు రాత్రులు, వివరాలకు ఫలానా చోటకు రండి, అంటూ..', చివరికి మొహమాట పెట్టి, మీ చేత ఒక పది 

వేలో, పాతిక వేలో కట్టించి గానీ వదలరు. మొదట్లో జనాలు గొర్రెల్లా వెళ్ళినా, క్రమంగా వాళ్ళను తప్పించుకోవడం అలవాటు పడ్డారు.

సినిమా వాళ్ళు కొత్త సినిమా రాగానే, మీడియా లో ఆటల పందాలు, పాటల పందాలు, ముఖ ముఖీలు పెట్టేసి, యే ఛానల్ లో చూసినా 

వాళ్ళే కనిపించి, హోరెత్తిన్చేస్తారు. 'దెయ్యం' సినిమాకి రాంగోపాల్ వెర్మ, దెయ్యం మాస్కులతో జనాలందరినీ వీధుల్లోనే హడలేత్తిన్చేసారు. 

రాజకీయ నాయకులు సానుభూతి యాత్రాలని, పోరు యాత్రాలని, ఓదార్పు యాత్రాలని, పాద యాత్రాలని తిరుగుతూ, ఒక నల్లటి చంటి 

పిల్లాడిని ఎత్తుకుని, ఒక ఏడ్చే ముసలమ్మను హత్తుకుని, ఫోటోలు దిగి ప్రచారం చేసుకుంటారు. ఇందులో పెద్ద తిరకాసు ఉందండోయ్, 

'జనాల కష్టాలు తీర్చకపోయినా పర్లేదు కాని,కన్నీళ్ళు తుడిచేస్తే,' ఓట్లు కొట్టేయ్యవచ్చని. మరి జీవిత ప్రవాహంలో ప్రచారం 
కూడా ఒక భాగమే 

కనుక, మనము ఇందులో పావులమే. ప్రచారం బుట్టలో పడుతూ, లేస్తూ, కొత్త పాఠాలు నేర్చుకుంటూ... సాగిపోదాం.

No comments:

Post a Comment